బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కరపత్రం ఆవిష్కరణ

బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కరపత్రం ఆవిష్కరణ

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఈనెల 24న చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర బిజెపి నేతలు మంగళవారం విడుదల చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి బంగారు శృతి, పాదయాత్ర ప్రముఖ్, సహ ప్రముఖ్ శ్రీ వీరేందర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, సుధాకర్ శర్మ,  చంద్రశేఖర్ హాజరై ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కరపత్రాలను ఆవిష్కరించారు. బండి సంజయ్ పాదయాత్రకు ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ పేరు కు ట్యాగ్ లైన్ గా నియంతృత్వ – కుటుంబ పాలన – అవినీతి విముక్తి కోసం నినాదం చేర్చారు. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.