వర్షాలపై కరీంనగర్ కలెక్టర్తో కలిసి బండి సంజయ్ సమీక్ష

వర్షాలపై కరీంనగర్ కలెక్టర్తో కలిసి బండి సంజయ్ సమీక్ష

వర్షాలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ నియోజకవర్గం చర్ల భూత్కూర్ గ్రామంలో పర్యటించిన ఆయన.. వానల వల్ల జనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగితెలుసుకున్నారు. 

అనంతరం బండి సంజయ్ కరీంనగర్ కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ ను కలిశారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయ కార్యక్రమాల గురించి బండి సంజయ్ కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహాయకచర్యల్ని వేగవంతం చేయాలని బండి సంజయ్ సూచించారు.