మక్కలు కొనకపోతే కేసీఆర్ ఫామ్ హౌజ్ ను ముట్టడిస్తాం

మక్కలు కొనకపోతే కేసీఆర్ ఫామ్ హౌజ్ ను ముట్టడిస్తాం

తెలంగాణ, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ నేతలు నీరుగార్చారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కామారెడ్డిలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న ఆయన..ఈ సందర్భంగా మాట్లాడారు. పేదల ఆత్మ బలి దానాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని..కరసేవకుల బలిదానాలతోనే అయోధ్యలో రామమందిరం నిర్మాణం అవుతోందన్నారు.

బెల్లంపై కేసీఆర్ ఆంక్షలు పెట్టారని..సీఎం మూర్ఖపు విధానాలతో రైతులు చెరుకు సాగు మానేశారని ఆరోపించారు. అంతేకాదు ..నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వరిసాగుపై రైతులకు కేసీఆర్ భరోసా కల్పించాలన్నారు. మొక్క జొన్నలు కొనకపోతే కేసీఆర్ ఫామ్ హౌజ్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఎం మెడలు వంచి మొక్కజొన్నలను కొనిపిస్తామన్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర దృష్టి మళ్లించేందుకే డ్రగ్స్ ఛాలెంజ్ లను లేవనెత్తారన్నారు బండి సంజయ్. డ్రగ్స్ ఎవడికి అవసరం? పేదోళ్లకు డ్రగ్స్ తీసుకునే అవసరం లేదన్నారు. సవాళ్లన్నీ కాంగ్రెస్,టీఆర్ఎస్ ల డ్రామాలేనన్నారు. రాష్ట్రంలో MIM గుండాల అరాచకాలు పెరిగిపోయాయన్న బండి..మజ్లీస్ ను నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు.