కేంద్రం పారా బాయిల్డ్ రైస్ కొనదు... దొడ్డు బియ్యం కొంటుంది

కేంద్రం పారా బాయిల్డ్ రైస్ కొనదు... దొడ్డు బియ్యం కొంటుంది

ధర్నా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం  సాధించింది శూన్యమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేంద్రం పారా బాయిల్డ్ రైస్ కొనదని... దొడ్డు బియ్యం కొంటుందన్నారు.   ఏ రాష్ట్రంలో అయినా పారాబాయిల్డ్ రైస్ కేంద్రం కొంటే.. తాను తెలంగాణ నుంచి కూడా కొనిపిస్తానన్నారు.  లేకుంటే కేసీఆర్ మొత్తం ధాన్యాన్ని రారైస్ గా కేంద్రానికి ఇవ్వాలన్నారు. రైతుల ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత కేసీఆర్ దే నన్నారు. సిరిసిల్లలో కూడా రైతులు టవర్లెక్కి నిరసన చెప్తుంటే వాళ్లపై కూడా టీఆర్ఎస్ కార్యకర్తలతో రాళ్లు వేయిస్తారా..? కట్టెలతో దాడి చేయిస్తారా..? అని ప్రశ్నించారు. రైతులకు కలిగిన  నష్టానికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని, .. మొత్తం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు.  లేకుంటే రాబోయే రోజుల్లో రైతులతో రాళ్లు వేయించుకునే రోజులు వస్తాయియన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలన్నారు.