బీజేపీ ఆఫీస్ లో ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు

బీజేపీ ఆఫీస్ లో ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా వాజ్ పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు కమలనాథులు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్, బిజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే చింతల పాల్గొని నివాళులర్పించారు. . ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాలని అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని బండి సంజయ్ తెలిపారు.  అణు పరీక్షలు, కార్గిల్ విజయం కోసం పని చేశారని గుర్తు చేశారు. వాజ్ పేయి  స్ఫూర్తితో  ప్రధాని నరేంద్రమోడీ పాలన చేస్తున్నారని తెలిపారు. 

తెలంగాణ లో జరుగుతున్న అవినీతి పాలనను ప్రజల ముందు ఎండగడుతున్నామని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వాజ్ పేయి స్ఫూర్తితో బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారని చెప్పారు.