కవితను, హరీశ్​ను ఓడించినం..కేటీఆర్‌‌‌‌నూ ఓడిస్తం

కవితను, హరీశ్​ను ఓడించినం..కేటీఆర్‌‌‌‌నూ ఓడిస్తం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం, పార్టీపై టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న అబద్ధాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. వాట్సప్ , ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఇన్ స్టా గ్రామ్   ద్వారా వాస్తవాలను  బూత్ లెవెల్ కు  తీసుకెళ్లాలన్నారు. ఆదివారం బీజేపీ ఐటీ సెల్ జీహెచ్ ఎంసీ సోషల్ మీడియా వారియర్స్  సమావేశంలో ఆయన మాట్లాడారు.  దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో బీజేపీ సోషల్ మీడియా వాస్తవాలను పబ్లిక్ లోకి అద్భుతంగా తీసుకెళ్లిందని, టీఆర్ఎస్ పార్టీ భయపడుతోందని గుర్తు చేశారు. ఇప్పటికే కేసీఆర్ కూతురు కవితను నిజామాబాద్ లో ఓడించామని, సీఎం అల్లుడు హరీశ్ రావు ఇన్‌చార్జ్ గా ఉన్న దుబ్బాకలో ఓడించామని, ఇప్పుడు ఆయన కొడుకు కేటీఆర్‌‌ను జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిస్తామని చెప్పారు. సోషల్ మీడియా టీమ్స్ టీఆర్ఎస్, కేసీఆర్ సర్కారు వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ఇంటింటికీ చేరవేయాలన్నారు. బీజేపీ సక్సెస్ స్టోరీలను, కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లను, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ , పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రదీప్, ప్రేమేందర్ రెడ్డి, శృతి, ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ,  గ్రేటర్ లోని 150 డివిజన్ల సోషల్ మీడియా వారియర్లు, పలువురు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.