కేసీఆర్, కేటీఆర్ భాష మార్చుకోవాలి

కేసీఆర్, కేటీఆర్ భాష మార్చుకోవాలి

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ,కాంగ్రెస్ కలిసి పోటీచేసే అవకాశముందని.. ఇద్దరి మధ్య ఒప్పందం కూడా జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర  అధ్యక్షులు బండి సంజయ్. తాగు, ఊగు  దండుకో  అనే  విధంగా మద్యాన్ని ప్రోత్సహిస్తూ..   లిక్కర్ సేల్స్  ద్వారా 50 వేల  కోట్ల ఇన్ కం  వచ్చేలా  ప్లాన్ చేసుకున్నారని  విమర్శించారు.   ముఖ్యమంత్రి,  మంత్రులు... భాష, యాస  చూసి  ప్రజలు అసహ్యించుకుంటున్నారని... కేసీఆర్, కేటిఆర్  భాష మార్చుకోవాలన్నారు.  వర్షాకాలం పంట  కొనబోమని  పీయూష్ గోయల్ ఎక్కడా చెప్పలేదన్నారు.  వానా కాలం  పంట కొంటామని  నామా నాగేశ్వర్  ముందే  పీయూష్ గోయల్ చెప్పారన్నారు.  అయినా రాష్ట్రంలో  వానాకాలం పంట  కొనడం లేదని.. రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ కు  కనిపించడం లేదా  అని ప్రశ్నించారు. 

రాజ్యసభ  ఎంపీలపైన  కేసీఆర్ కు  కోపం ఉన్నట్లుందన్నారు  బండి సంజయ్. అందుకే రాజ్యసభ ఎంపీలతో  రాజీనామా చేయించాలని  అనుకుంటున్నారని  తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు తెచ్చుకున్న  ప్లకార్డ్స్ ని   వాళ్లే చింపేసి.. నామా నాగేశ్వరరావు  మీద పడేసి వెళ్లిపోయారన్నారు.  పీయూష్ గోయల్  హౌస్ లో  సమాధానం చెప్పిన  తర్వాత  టిఆర్ఎస్ పరువు  పోయిందని.. అందుకే  వాళ్ళు మాట్లాడటం  లేదన్నారు. కేసీఆర్  ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయాడన్నారు.  బాయిల్డ్  రైస్   ఇవ్వబోమనే ఒప్పందం  మీద  కేసీఆర్ సంతకం చేశారని...  కృష్ణా జలాల  వాటాల ఒప్పందం  మీద  కూడా ఇలాగే  సంతకం చేశారని తెలిపారు.