భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర

భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర

2040 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ పాదయాత్రలో భాగంగా నాగోల్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.. ఎంఐఎం కనుసన్నల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పని చేస్తోందని ఫైర్ అయ్యారు. పీఎఫ్ఐతో టీఆర్ఎస్ కు సంబంధముందని..  టీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని సంజయ్ ఆరోపించారు.

ఎన్ఐఏ  వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి సర్కార్ కు సోయి లేదని బండి సంజయ్ అన్నారు. ఎంఐఎం ఆగడాలను బీజేపీ మాత్రమే అడ్డుకుంటుందన్నారు. కేసీఆర్ కుటుంబానికి లంచాలిస్తే తప్ప పనులు కాని పరిస్థితి ఉందన్నారు. ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర ఉందని సంజయ్ అన్నారు . కొన్నిపీఎఫ్ఐ సంస్థలకు టీఆర్ఎస్ నేతలు ఫండ్స్ ఇస్తున్నారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి కేసీఆర్ కుటుంబం క్వారంటైన్ పోతోందన్నారు.