మేం ప్రతిదాడులకు దిగితే టీఆర్ఎస్ తట్టుకోలేదు

మేం ప్రతిదాడులకు దిగితే టీఆర్ఎస్ తట్టుకోలేదు


రాత్రంతా డబ్బులు పంచినా మేధావులు లొంగ లేదని టీఆర్ఎస్ తెలుసుకుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఇవాళ కూడా ఓటుకు రూ.10 వేలు పంచుతుంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఓటమి భయంతో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ దాడులకు దిగుతోందన్నారు. తాము ప్రతిదాడులకు దిగితే టీఆర్ఎస్ ఎదుర్కొనలేదన్నారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి రెండు నియోజకవర్గాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో మా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ పై దాడిని ఖండిస్తున్నామన్నారు.  పోలీసుల సమక్షంలో తమ వాళ్ళ పై దాడి జరిగిందన్నారు.