రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు బండి సంజయ్. గ్రాడ్యుయేట్లు టీఆర్ఎస్ ను వ్యతిరేకించారన్నారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. రెండు రోజులుగా టీఆర్ఎస్ ఇస్టానుసారంగా పైసలు పంచిందన్నారు. పోలీసులు చూస్తుండగానే డబ్బులు పంచారన్నారు. కోట్లు పంచిపెట్టినా టీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారన్నారు. ప్రేమందర్ రెడ్డిపై దాడికి ప్రయత్నించారన్నారు. పోలింగ్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు  లేక చాలా మంది తిరిగి వెళ్లిపోయారన్నారు. రేపు ఉదయం 8  గంటలలోపు సంతోష్, నాగోజీలను విడుదల చేయాలన్నారు. భైంసా అత్యాచార ఘటనపై సీఎం మాట్లాడకపోవడం దారుణమన్నారు. టీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. అత్యాచార ఘటనపై ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదన్నారు. విలేకరులపై దాడి చేస్తే మాట్లాడలేదన్నారు.భైంసాలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.