
వడ్ల కొనుగోలుపై కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతోందన్నారు బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్. వడ్లు మాత్రమే కొనాలంటూ కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెల్వదన్నారు. ఫామ్ హస్ లో వరి పండించి.. రైతులను మాత్రం వరేస్తే ఉరి అంటుండన్నారు. రైతులు ఇబ్బంది పడుతుంటే చూసి కేసీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ తీరుతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్నారు. మొన్నటి వరకు ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం చేసిన కేసీఆర్ .. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో వెనకడుగు వేశారన్నారు. మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదని కేసీఆర్ అంటున్నారన్నారు. అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదన్నారు. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తదన్నారు. తెలంగాణలో బీజేపీకి 95 నుంచి 105 సీట్లు, టీఆర్ఎస్ కు 9 లేదా 10 సీట్లు వస్తాయన్నారు.
కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలు కేసీఆర్ కు నచ్చవన్నారు. కశ్మీర్ లో జరిగిన అరాచకాలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకునే దమ్ము కేసీఆర్ కు లేదన్నారు. కేసులతో బీజేపీ కార్యకర్తలను అడ్డుకోలేరన్నారు. బోధన్ లో 35 మంది బీజేపీ కార్యకర్తలపై 307 కేసులు, సిరిసిల్లలో 25 మందిపై 307 కేసులు పెట్టారన్నారు. ఆపరేషన్ గంగాను కూడా కేసీఆర్ విమర్శిస్తున్నాడన్నారు. దేశంలో లేని సమస్యను తెలంగాణలో ఎందుకని ప్రశ్నించారు.