TRS కనుసన్నలలోనే కాంగ్రెస్ విధ్వంసం

TRS కనుసన్నలలోనే  కాంగ్రెస్  విధ్వంసం

ఆందోళన పేరుతో కాంగ్రెస్ విధ్వంసం సృష్టించిందని తెలిపారు బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గురువారం మీడియాతో మాట్లాడిన సంజయ్.. కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కు ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న ఆయన.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. స్వతంత్ర సమర యోధులు ఏర్పాటు చేసిన దాన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నారని తెలిపారు. ఊరికే దొబ్బిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఈడి విచారణ చేయొద్దా.. అక్రమాలు బయటకు వస్తూ కాంగ్రెస్ ను ప్రజలు సమాధి చేస్తారని భయంతోనే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. మోడీ, అమిత్ షా లు కూడా విచారణను ఎదుర్కొని.. నిజాయితీని నిరూపించుకొని బయటకు వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లాగా విధ్వంసాలకు పాల్పడలేదన్న బండి సంజయ్.. అనుమతి లేదని మమ్మల్ని గృహ నిర్భంధం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ వాళ్లు తడాఖా చూపిస్తామన్నా వారిని ముందస్తు అరెస్ట్ చేయరని తెలిపారు. ప్రగతి భవన్ కు వెళ్లొద్దు, రాజ్ భవన్ కి మాత్రం వెళ్లొచ్చట. TRS  ఆధీనంలోనే  కాంగ్రెస్ చేసిన విధ్వంసం ఇది అన్నారు. నేషనల్ హెరాల్డ్ కు సంబందించి వాస్తవాలను బయటకు చెప్పాలని.. ఈడి విచారణ ఎందుకో ప్రజలకు వివరిస్తామన్నారు.  బీజేపీ బలపడుతుందనే కాంగ్రెస్, తెరాస కలిసి ఆడుతున్న నాటకం అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి కాంగ్రెస్ నాయకులే పట్టించుకోవడం లేదని.. అయన నిజాయితీనీ నిరూపించుకొని బయటకు రావాలన్నారు. మోడీ అమిత్ షా  కేసులను ఎదుర్కొని బయటకు వచ్చారు కదా అన్నారు బండి సంజయ్.