తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది

తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది

తెలంగాణలో నియంత, కుటుంబ గడీల పాలన నడుస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాదయాత్రపై జరిగిన కార్యకర్తల వర్క్ షాప్ లో మాట్లాడారు. కర్నాటక తరహాలో ఉద్యమించి.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్.