దమ్ముంటే.. కేసీఆర్ పాతబస్తీలో ప్రచారం చేయాలి

దమ్ముంటే.. కేసీఆర్ పాతబస్తీలో ప్రచారం చేయాలి

ఎంఐఎంతో పొత్తు లేకుంటే కేసీఆర్ పాతబస్తీలో ప్రచారం చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ కు దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు.ఎంఐఎంకు ఓటేస్తే రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు ఉంటారన్నారు. పాతబస్తీ వాసులు ఆలోచించి ఓటేయాలన్నారు..ఎంఐఎంకి మేయర్ పదవి ఇచ్చి పాతబస్తీలో హిందువులను తరిమేస్తారని ప్రశ్నించారు. మార్పు కోసం జనం కోసం బీజేపీ అన్నారు. ఛేంజ్ హైదరాబాద్ వెబ్ సైట్ కార్యక్రమంలో మాట్లాడిన సంజయ్..కార్యకర్తల కష్టం, రఘునందన్ పని తీరుతో దుబ్బాకలో విజయం సాధించామన్నారు. దుబ్బాక మాదిరే హైదరాబాద్ వాసులు మార్పు కోరుతున్నారన్నారు. రోజు రోజుకు బీజేపీ బలపడుతుందన్నారు. అన్ని సర్వేల్లో బీజేపీ విజయం ఖాయమని తేలిందన్నారు. అన్ని రకాలుగా హైదరాబాద్ మారాలన్నారు.

5 ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు. రోడ్ల అధ్వానంగా ఉన్నాయన్నారు. మంచి నీళ్లు లేవన్నారు. రెండు ఫ్లైఓవర్లు కట్టి అభివృద్ధి చేశామంటున్నారు. నోటిఫికేషన్లు లేవు..నిరుద్యోగ భృతి లేదన్నారు. కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారన్నారు. ఒక్క చాన్స్ ఇస్తే  హైదరాబాద్ ను అభివృద్ధి చేసి చూపిస్తమన్నారు. టీఆర్ఎస్ భాగ్యనగరాన్ని విషాదనగరంగా మార్చిందన్నారు.