ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి

ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్.  విమోచన దినోత్సవం కోసం ఫైట్ చేస్తున్నా.. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. రేపు నిర్మల్ లో భారీ బహిరంగా నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ సభకు హాజరవుతారన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులో రాష్ట్ర సర్కార్ ఉందన్నారు.కామారెడ్డి జిల్లా బంజారాతండా నుంచి 20వ రోజు పాదయాత్ర ప్రారంభించారు బండి సంజయ్. కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారన్నారు.