"ప్రజా సంగ్రామ యాత్ర" వాయిదా వార్తల్లో నిజం లేదు

"ప్రజా సంగ్రామ యాత్ర" వాయిదా వార్తల్లో నిజం లేదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వాయిదాపడిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత వల్ల సంజయ్ అనారోగ్యానికి గురైనప్పటికీ పాదయాత్ర కొనసాగించేందుకు ఆయన మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రకు విరామం లేదని.. కేవలం నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభ మాత్రమే 27కు బదులు 29న ఉంటుందని మనోహర్ ప్రకటించారు. ప్రతి రోజు నడిచే కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తున్నందునే నారాయణ పేట సభ 2 రోజులు ఆలస్యం అయిందని చెప్పారు. కేవలం సమాచారం లోపం వల్లే పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇస్తున్నట్లు పొరపాటున ప్రకటించినట్లు మనోహర్ రెడ్డి వెల్లడించారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఇవాళ మక్తల్ బహిరంగ సభలో పాల్గొని, రేపు యథావిధిగా పాదయాత్ర ప్రారంభించనున్నారు. గత 12 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేయడం వల్ల ఆయనకు వడదెబ్బ తగలడంతో పాటు ఎసిడిటీ సమస్య తలెత్తింది. అస్వస్థతకు లోనవడంతో సంజయ్కు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్లు ఆరోగ్యరిత్యా పాదయాత్రకు విరామం ఇవ్వాలని సూచించగా.. ఆయన మాత్రం యాత్ర కొనసాగించేందుకే మొగ్గుచూపారు.