టీఆర్ఎస్ నాయకులు లైసెన్స్‌డ్ గూండాలుగా మారిపోయారు

టీఆర్ఎస్ నాయకులు లైసెన్స్‌డ్ గూండాలుగా మారిపోయారు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో  ఆరేండ్ల చిన్నారిపై టీఆర్ఎస్ నాయకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన దుర్మార్గమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించారు .టీఆర్ఎస్ పాలనలో పసిపిల్లలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.  రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు లైసెన్స్ డ్ గూండాలుగా మారిపోయారన్నారు. అభంశుభం తెలియని పసిపాప బంగారు భవిష్యత్తును నాశనం చేసిన ముర్ఖుడిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత చిన్నారి కుటుంబ సభ్యులకు బిజెపి అండగా ఉంటుందన్నారు.