ప్రభుత్వాన్ని, పోలీసులను ఎవరినీ వదలం

ప్రభుత్వాన్ని, పోలీసులను ఎవరినీ వదలం

బీజేపీ కార్యకర్తలను అరెస్టులు చేసి జైలుకు పంపుతున్న కేసీఆర్ కు.. మున్ముందు ఇదే గతి పడుతుందన్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. భైంసాలో దాడులు చేసిన వారిని వదిలి.. 25 మంది అమాయక బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని ఆరోపించారు. దాడులకు పాల్పడే దుండగులకు భైంసాలో ఓవర్గం షెల్టర్ కల్పిస్తుంటే సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. బైంసా అల్లర్ల కేసులో అరెస్టయిన హిందూవాహిని కార్యకర్తలను.. ఆదిలాబాద్ జిల్లా జైలులో పరామర్శించారు సంజయ్. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించటంతో.. ప్రస్తుతం కార్యకర్తలు మాట్లాడలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. గవర్నర్ ను కలవటంవల్లే హిందూవాహిని కార్యకర్తల అరెస్ట్ చూపించి.. అదిలాబాద్ జైలుకు పంపారని అన్నారు . అక్రమ కేసులతో వేధిస్తున్నడలేదన్నారు సంజయ్.