టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పార్టీ బీజేపీ ఒక్కటే

టీఆర్ఎస్ ను ఎదుర్కొనే పార్టీ బీజేపీ ఒక్కటే

రాష్ట్రంలో TRSను ఎదుర్కొనే పార్టీ బీజేపీ ఒక్కటే అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫీస్ లో జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపి ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన బండి సంజయ్..రాష్ట్రంలో గడిల పాలనను అంతం చేసి 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పేద ప్రజల కోసం బీజేపీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు సంజయ్.బీజేపీ లేని పార్టీని దేశ ప్రజలు ఉహించుకోవడం కష్టమన్నారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా TRS ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఉగ్రవాదంతో సాధించేది ఏమీ లేదన్నారు. ఛత్తీస్ ఘడ్ ఘటన బాధకరం అన్న కేంద్ర మంత్రి...మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలన్నారు.