ఢాకా: ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తరలించినందుకు భారత ప్రధాని మోడీకి బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ లెటర్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్నవారి తరలింపు విషయంలో మోడీ తీసుకున్న చర్యలను షేక్ హసీనా కొనియాడారు. గతేడాది తమ దేశంలో నిర్వహించిన బంగ్లాదేశ్ జాతిపిత బంగాబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ జయంతి వేడుకలకు హాజరైనందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న భారత ప్రభుత్వానికి రుణపడి ఉంటామని షేక్ హసీనా పేర్కొన్నారు.
Bangladesh PM Sheikh Hasina Ji thanks PM @NarendraModi Ji for evacuating Bangladeshi students stranded in Ukraine.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 19, 2022
India always stands firmly shoulder to shoulder with the brothers & sisters of Bangladesh.
? https://t.co/oD7QpK7a9T pic.twitter.com/JCLQ8dXGDV
మరిన్ని వార్తల కోసం: