మోడీకి బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా కృతజ్ఞతలు

మోడీకి బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా కృతజ్ఞతలు

ఢాకా: ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తరలించినందుకు భారత ప్రధాని మోడీకి బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ లెటర్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్నవారి తరలింపు విషయంలో మోడీ తీసుకున్న చర్యలను షేక్ హసీనా కొనియాడారు. గతేడాది తమ దేశంలో నిర్వహించిన బంగ్లాదేశ్ జాతిపిత బంగాబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ జయంతి వేడుకలకు హాజరైనందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ కు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న భారత ప్రభుత్వానికి రుణపడి ఉంటామని షేక్ హసీనా పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

ఉక్రెయిన్ తీరుపై పుతిన్ ఫైర్

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్