తహశీల్దార్ సుజాత అరెస్ట్

తహశీల్దార్ సుజాత అరెస్ట్

హైదరాబాద్: బంజారాహిల్స్ లో 40 కోట్ల రూపాయల భూ వ్యవహారాంలో తహశీల్దార్ సుజాతను అరెస్ట్ చేసింది ఏసీబీ.   భూవ్యవహారంలో సుజాతను విచారించారు ఏసీబీ అధికారులు. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు కూడా సుజాత ఆధారాలు చూపలేకపోయరని సమాచారం.

వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట ఆమెను హాజరు పరచనున్నారు. ఇదే కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు RI నాగార్జునరెడ్డి, SI రవీంద్రనాయక్. కేసులో తహశీల్దార్ సుజాత పాత్ర ఉన్నట్టు గుర్తించింది ఏసీబీ.