న్యూఢిల్లీ: వారానికి ఐదు రోజుల పనిదినాలను డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నాయి. జనవరి 25, 26 హాలిడేస్తో పాటు 27 న ప్రభుత్వ బ్యాంకులు ఓపెన్ కావు. చీఫ్ లేబర్ కమిషనర్తో యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) బుధ, గురువారాల్లో చర్చలు జరిపినా ఫలితం రాలేదు.
ఉద్యోగులు ఐదు రోజుల వర్క్ వీక్ను కోరుతున్నారు. ఆర్బీఐ, ఎల్ఐసీ, స్టాక్ ఎక్స్చేంజ్లు ఇప్పటికే ఈ విధానం పాటిస్తున్నాయని యూఎఫ్బీయూ పేర్కొంది. కాగా, ఈ సమ్మె వలన ప్రైవేట్ బ్యాంకులు ప్రభావితం కావు.
