
ఖాతాదారులకు కార్డులు జారీ లో రూపే కార్డులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి బ్యాంక్ ఖాతాలన్నింటిని ఆధార్తో అనుసంధానం చేయాలని, అవసరమైనప్పుడు పాన్కార్డులతో కూడా లింక్ పూర్తి చేయాలని కోరారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) 73వ వార్షిక సాధారణ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCL) భారత బ్రాండ్ ప్రొడక్ట్గా మారే అవకాశాలున్నాయన్నారు నిర్మలా సీతారామన్. ఎన్పీసీఐ నిర్వహించే రూపే కార్డులనే ఇవ్వాలని ఆమె సూచించారు. భారతీయ బ్యాంకులు అద్భుతంగా పనిచేశాయన్నారు. వ్యవస్థలో ధృవీకరించని బ్యాంక్ ఖాతా ఉండకూడదని ఆదేశించారు. బ్యాంకింగ్లో యూపీఐ చెల్లింపులు సక్రమంగా జరిగేలా కృషి చేయాలని బ్యాంకర్లకు సూచించారు.