
ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ శుక్రవారం (మే 30) గుజరాత్ టైటాన్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ కు సిద్ధమవుతుంది. 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ మరో ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలవాల్సిందే. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్ గెలిస్తే క్వాలిఫయర్ 2.. అది కూడా గెలిస్తే ఫైనల్. దీంతో ముంబై కుదురుకోవడానికి ఇక సమయం లేదు. ఇకపై ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై కావడంతో విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిందే.
ALSO READ | PBKS vs RCB: మా జట్టులోని ఆ నలుగురు ఆటగాళ్లు టీమిండియాకు ఆడతారు: రికీ పాంటింగ్
గుజరాత్ టైటాన్స్ తో జరగబోయే మ్యాచ్ కు ముంబై ఎలాంటి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగబోతుందో ఆసక్తికరంగా మారింది. ముంబై స్టార్ ఫారెన్ ప్లేయర్లు రికెల్ టన్, విల్ జాక్స్ దూరం కావడం ముంబైకి గట్టి ఎదురు దెబ్బ. వీరి స్థానాల్లో చరిత అసలంక, బెయిర్ స్టో ప్లేయింగ్ 11లోకి రానున్నారు. వీరిద్దరూ తుది జట్టులో స్థానం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకుంట ముంబైకి మరో ఆప్షన్ లేదు. విల్ జాక్స్ స్థానంలో ముంబై ఇండియన్స్ జానీ బెయిర్ స్టోను నియమించుకుంది. ఈ ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ రూ.5.25 కోట్ల రూపాయలకు ముంబై జట్టులో చేరనున్నాడు.
ఈ రెండు మార్పులు మినహాయిస్తే ముంబై తమ ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ట్రెంట్ బోల్ట్, మిచెల్ సాంట్నర్ ముంబై జట్టులో మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ గాడిలో పడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ కొనసాగిస్తే ముంబైకి తిరుగుండదు. హార్దిక్ పాండ్య బ్యాటింగ్ లో మెరుగవ్వాల్సి ఉంది. జస్ప్రీత్ బుమ్రాపైనే ముంబై మరోసారి అసలు పెట్టుకుంది.
గుజరాత్ తో ఎలిమినేటర్ మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI (అంచనా) :
జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, చరిత్ అసలంక, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా