PBKS vs RCB: మా జట్టులోని ఆ నలుగురు ఆటగాళ్లు టీమిండియాకు ఆడతారు: రికీ పాంటింగ్

PBKS vs RCB: మా జట్టులోని ఆ నలుగురు ఆటగాళ్లు టీమిండియాకు ఆడతారు: రికీ పాంటింగ్

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ సమిష్టిగా రాణిస్తుంది. ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఆ జట్టు జట్టుగా ఆడుతూ విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఈ టోర్నీకి ముందు ఎలాంటి అంచనాలు లేకపోయినా లీగ్ దశలో అదరగొట్టి ఏకంగా టేబుల్ టాపర్ గా నిలిచింది. మరో రెండు మ్యాచ్ లు గెలిస్తే తొలిసారి టైటిల్ కల నెరవేర్చుకుంటుంది. ఇందులో భాగంగా గురువారం (మే 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో క్వాలిఫయర్ 1 ఆడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. పంజాబ్ ఇంత మెరుగ్గా రాణించడానికి బ్యాటింగ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా దుములేపుతున్నారు. జట్టుకు కావాల్సిన మంచి ఆరంభాలని దాదాపు ప్రతి మ్యాచ్ లో వీరిద్దరూ అందించారు. ఇక శ్రేయాస్ అయ్యర్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో అదరగొడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ తమ పాత్రకు న్యాయం చేస్తున్నారు. పంజాబ్ బ్యాటింగ్ పట్ల మురిసిపోతున్న ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తమ బ్యాటింగ్ యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. ఏకంగా నలుగురు ప్లేయర్స్ భవిష్యత్ లో భారత జట్టుకు ఆడతారని ధీమా వ్యక్తం చేసాడు. ఇంతకీ ఆ నలుగురు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

ALSO READ | PBKS vs RCB: కప్ కొడుతున్నాం.. జూన్ 4 న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతాను: పంజాబ్ స్టార్ బ్యాటర్

రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. " ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ వంటి ఆటగాళ్ళు భవిష్యత్తులో భారత జట్టు తరపున ఆడతారని జోస్యం చెప్పాడు. ఈ సీజన్‌లో హర్‌ప్రీత్ బ్రార్, విజయ్‌కుమార్ వైశక్‌ జట్టు కోసం చేసిన పాత్రను మర్చిపోను.  ప్రియాంష్ ఆర్యను చూస్తే మేము ఆర్యపై దృష్టి పెట్టాము. 24 ఏళ్ళ వయసులో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ప్రతిభ అద్భుతం. ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఐపీఎల్ లో అతను ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేశాడు. వధేరా మిడిల్ ఆర్డర్ టీమిండియా తరపున ఆడాలని భావిస్తున్నాను. శశాంక్ చాలా కూల్ అతని కూడా త్వరలో భారత జట్టులో స్థానం లభిస్తుంది". అని పాంటింగ్ తెలిపాడు. 

ఐపీఎల్ 2025లో పంజాబ్ జట్టు  కాన్ఫిడెంట్ మాములుగా లేదు. ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్ లు గెలిస్తే తొలిసారి ట్రోఫీ గెలుస్తుంది. 2014 తర్వాత క్వాలిఫయర్ 1 ఆడుతున్న పంజాబ్.. ఈ సారి టైటిల్ వదలకూడదనే గట్టి పట్టుదలగా ఉంది. గురువారం (మే 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా క్వాలిఫయర్ 2 లో గెలిచి ఫైనల్ కు వెళ్లేందుకు మరో అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఫైనల్ కు వెళ్లి టైటిల్ గెలిచినా ఆశ్చర్యం లేదు.