నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరం పాత పద్ధతిలోనే అడ్మిషన్లు జరగనున్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగానే విద్యార్థుల ఎంపిక జరగనుందని బాసర ట్రిపుల్ ఐటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాదికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గతేడాది కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించనందున పాలిసెట్ లో వచ్చిన మార్కుల ద్వారా విద్యార్థులకు అడ్మిషన్ల ను కల్పించారు. అయితే ఈ విద్యా సంవత్సరం టెన్త్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు జరగనున్నట్లుగా బాసర ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి డాక్టర్ వై రాజేశ్వర్ రావు తెలిపారు.
