BASARA: రేంజర్ల రాజేష్పై కేసు నమోదు

BASARA:  రేంజర్ల రాజేష్పై కేసు నమోదు

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్ పై కేసు నమోదయ్యింది. బాసర గ్రామస్తులు ఆలయ అర్చక బృందం ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 153, 504 సెక్షన్ ల కింద రాజేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

సరస్వతీపై రేంజర్ల రాజేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు, వ్యాపార సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చారు. రాజేష్ వ్యాఖ్యలకు నిరసనగా  అమ్మవారి క్షేత్రంలోని దుకాణాలు, ఆటోలు, రెస్టారెంట్ లు మూసివేశారు. ధర్నాలో బాసర గ్రామస్తులతో పాటు యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేంజర్ల రాజేష్ పై చర్యలు తీసుకోవాలని, అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ షాపులు బంద్ చేయించి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.