ఖమ్మం స్కూళ్లల్లో బతుకమ్మ సంబురం

ఖమ్మం స్కూళ్లల్లో బతుకమ్మ సంబురం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూళ్లలో గురువారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నుంచి దసరా సెలవులు కావడంతో ముందస్తు వేడుకలు జరిపారు. టీచర్లు, స్టూడెంట్లు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. హెడ్​మాస్టర్లు, ప్రిన్సిపాల్స్ బతుకమ్మ

 దసరా పండుగల విశిష్టతను స్టూడెంట్లకు వివరించారు. ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని రెజొనెన్స్ స్కూల్​లో నిర్వహించిన పూల పండుగలో మేయర్​పూనుకొల్లు నీరజ పాల్గొని టీచర్లు, స్టూడెంట్లతో బతుకమ్మ ఆడారు. ఉత్సవాల్లో ప్రిన్సిపాల్ ఎం.ప్రసన్నరావు, టీచర్లు పాల్గొన్నారు. 

ALSO READ: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ : మంజుల