సైఫాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి వల్లే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని విమర్శించారు. శుక్రవారం సైఫాబాద్లోని బీసీ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వెరిక సురేశ్ ఆధ్వర్యంలో.. బీసీ విద్యార్థి యువజన సంఘాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 7, 8, 9లతో లక్షలాది మందిని ఆందోళనకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్కు, జులై 15న 'చలో హైదరాబాద్'కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగిరాకపోతే సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్క్ వరకు భారీ విద్యార్థి మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు
