19న బీసీల శంఖారావం

19న బీసీల శంఖారావం

హైదరాబాద్​, వెలుగు: త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికల కోసం బీసీలంతా ఏకం కావాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. బీసీ జనాభా ఎక్కువున్న నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయిలో నిర్మాణాత్మక కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు శనివారం కరీంనగర్​లో బీసీల శంఖారావం సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం ఆయన శంఖారావం సభ పోస్టర్​ను ఆవిష్కరించారు. వార్డ్​ మెంబర్​ నుంచి మున్సిపల్​ చైర్మన్​దాకా బీసీ రిజర్వేషన్లతో ఎన్నికైన వాళ్లంతా సభకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.