సికింద్రాబాద్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని సదరన్ పొలిటికల్ అకాడమీ అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం తార్నాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీసీని సీఎం చేయకపోవడం అగ్రవర్ణాల ఆధిపత్యానికి నిదర్శమని విమర్శించారు. బీసీని సీఎం అభర్థిగా ప్రకటిస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమ అజెండాలో చేర్చాలని కోరారు. బీసీ డిక్లరేషన్లు లాంటి అంశాలను పక్కనపెట్టి.. పెరిగిన జనాభాకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించాలన్నారు.
ALSO READ :ఇండస్ట్రియల్ కారిడార్ హామీ ఏమాయే ?