బీసీలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి : జాజుల లింగంగౌడ్

బీసీలకు కేసీఆర్  క్షమాపణ చెప్పాలి :  జాజుల లింగంగౌడ్

ఓయూ, వెలుగు: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రౌడీషీటర్ నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారంటూ బీసీలను అవమానించేలా మాట్లాడిన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. కేసీఆర్​ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద కేసీఆర్​ ఫొటోలను చించి నిరసన తెలిపారు. దహనం  చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. 

ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ.. బీసీలను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. బీసీ ఓట్లతోనే పదేళ్లు సీఎం పదవి అనుభవించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కూర శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరబోయిన లింగయాదవ్, బీసీ విద్యార్థి సంఘం ఓయూ ఇన్​చార్జి గోదా రవీందర్, గుంటి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.