కోల్ బ్లాక్ల వేలంలో సింగరేణి పాల్గొనాలి..మణుగూరు పీకే ఓసీపీ ఎక్స్టెన్షన్బ్లాక్

కోల్ బ్లాక్ల వేలంలో సింగరేణి పాల్గొనాలి..మణుగూరు పీకే ఓసీపీ ఎక్స్టెన్షన్బ్లాక్
  • ఐఎన్​టీయూసీ సెంట్రల్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్ నర్సింహరెడ్డి

గోదావరిఖని, వెలుగు:  కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో త్వరలో కోల్​ బ్లాక్​ల వేలం జరగనుండగా సింగరేణి పాల్గొని, మణుగూరు పీకే ఓసీపీ ఎక్స్​టెన్షన్​బ్లాక్​ను పొందాలని ఐఎన్ టీయూసీ సెంట్రల్​సీనియర్​వైస్​ ప్రెసిడెంట్​ఎస్​.నర్సింహరెడ్డి కోరారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్​ క్లబ్​లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.  పీకే ఓసీపీ డిప్​సైడ్​ఎక్స్​టెన్షన్​ బ్లాక్​ను సింగరేణి సంస్థ దక్కించుకుంటే  మరో 20 ఏండ్ల పాటు 60 మిలియన్​టన్నుల బొగ్గు వెలికితీసే చాన్స్ ఉందని పేర్కొన్నారు. తద్వారా మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి కొనసాగడంతో పాటు కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. 

ప్రైవేటు కార్పొరేట్​సంస్థలు బ్లాక్​ను పొందడానికి అప్లికేషన్లు తీసుకున్నాయని, ఆ బ్లాక్ ను నడిపించడం వాటికి సాధ్యం కాదన్నారు. మట్టి డంప్​కోసం అవసరమైన ప్రైవేటు భూమి అందుబాటులో లేదన్నారు. 

కోల్​బ్లాక్​ను  సింగరేణి సంస్థకే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు, కార్పొరేట్​సంస్థ వేలంలో పాల్గొంటే అన్ని సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. త్వరలో సీఎం రేవంత్​రెడ్డిని కలిసి కార్మికుల సమస్యలపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. ఆర్జీ –1 ఏరియా వైస్​ప్రెసిడెంట్​ కె.సదానందం, లీడర్లు ఆరేపల్లి శ్రీనివాస్,  గడ్డం కృష్ణ,  సత్యనారాయణరెడ్డి, గంగాధర్​, లలితాశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

అదానీ, మెగా కంపెనీలకు ఇస్తే అడుగుపెట్టనివ్వం  
ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య

గోదావరిఖని:  కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్​ల వేలంలో మణుగూరులోని పీకే ఓసీపీ ఎక్స్​టెన్షన్​ప్రాజెక్ట్​ను సింగరేణికే అప్పగించాలని సంస్థ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్​వి.సీతారామయ్య డిమాండ్​ చేశారు. అదానీ, మెగా కంపెనీ వంటి కార్పొరేట్​సంస్థలకు అప్పగిస్తే అన్ని సంఘాలతో కలిసి ఉద్యమించి అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. 

మంగళవారం గోదావరిఖని ప్రెస్​ క్లబ్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మణుగూరు బ్లాక్​ను సింగరేణికి కేటాయించేందుకు కేంద్రంపై  ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ సమావేశంలో లీడర్లు మడ్డి ఎల్లయ్య గౌడ్, దాసరి శ్రీనివాస్, గౌతమ్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.