
ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఇండియా ఏ జట్టును శుక్రవారం (మే 16) ప్రకటించారు. 20 మందితో కూడిన ఈ జాబితాలో ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్ కు ఛాన్స్ దక్కింది. పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న ఇషాన్ కిషన్ కు సైతం సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. అభిమన్యు ఈశ్వరన్ ఆ జట్టుకు నాయకత్వం వహిస్తారు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. 20 మందితో కూడిన స్క్వాడ్ లో టెస్ట్ రెగ్యులర్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ కూడా ఉన్నారు.
ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయం కారణంగా ఐపీఎల్ 2025 కు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ సెలక్టయ్యాడు. ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలర్లుగా జట్టులో స్థానం దక్కించుకున్నారు. 2024/25 రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మానవ్ సుతార్ తో పాటు తనుష్ కోటియన్, అన్షుల్ కాంబోజ్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దుబే వంటి అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్ రెండో మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నట్టు సమాచారం.
ALSO READ | IPL 2025: ఢిల్లీకి భారీ ఊరట.. యార్కర్ల వీరుడికి బంగ్లాదేశ్ బోర్డు గ్రీన్ సిగ్నల్
జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-27 సైకిల్ లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ కు భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి ఇండియా ఎక్కువగా యంగ్ ప్లేయర్లతోనే బరిలోకి దిగబోతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. తొలి టెస్ట్ మే 30 నుండి కాంటర్బరీలోని స్పిట్ఫైర్ గ్రౌండ్లో జరుగుతుంది. రెండో టెస్ట్ జూన్ 6 నుండి నార్తాంప్టన్లోని కౌంటీ గ్రౌండ్లో జరుగుతుంది.
ఇంగ్లండ్ టూర్కు భారత ఎ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ కమ్ద్రాజ్, హర్షిత్ రణా గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండే, హర్ష్ దూబే.
BCCI announce a strong squad for the upcoming India A tour of England, which precedes the upcoming five-match Test series 🇮🇳 pic.twitter.com/fM1lFcKA9d
— ESPNcricinfo (@ESPNcricinfo) May 16, 2025