IND vs ENG 2025: టీమిండియా స్క్వాడ్‌లో హర్షిత్ రాణా.. ప్లేయింగ్ 11లో ఆడితే వేటు పడేది అతడిపైనే!

IND vs ENG 2025: టీమిండియా స్క్వాడ్‌లో హర్షిత్ రాణా.. ప్లేయింగ్ 11లో ఆడితే వేటు పడేది అతడిపైనే!

ఇంగ్లాండ్ సిరీస్ కు ముందు భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా చేరాడు. శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా శుక్రవారం (జూన్ 20) లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్ట్ కోసం భారత జట్టులో హర్షిత్ రాణాను భారత సెలక్టర్లు చేర్చినట్టు బీసీసీఐ ధృవీకరించింది. "లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్టు కోసం భారత జట్టులో హర్షిత్ రాణాను మెన్స్ సెలక్షన్ కమిటీ చేర్చింది" అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక మీడియా ప్రకటనలో తెలిపారు.

ఇండియా ఎ జట్టులో సభ్యుడైన రాణా మొదట ప్రకటించిన 18 మంది ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే రాణాను తొలి టెస్ట్ కోసం భారత స్క్వాడ్ లో చేర్చడం విశేషం. హర్షిత్ గత ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. పెర్త్‌లో జరిగిన తన తొలి టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టి రాణించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై    295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.  23 ఏళ్ల రాణా లీడ్స్‌లో జరగబోయే తొలి టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాణా ఆడిన రెండు టెస్టుల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.

►ALSO READ | IND vs ENG 2025: క్రికెట్ కంటే కోహ్లీ గొప్పేం కాదు: ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు అశ్విన్ హాట్ కామెంట్స్

తొలి టెస్టులో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ లో రాణా ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లతో కలిసి రాణా పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటాడు. ఒకవేళ రాణా తుది జట్టులో ఉంటే ప్రసిద్ కృష్ణకు నిరాశ తప్పకపోవచ్చు. ఆకాష్ దీప్ ఉన్నప్పటికీ హర్షిత్ రానా వైపే భారత యాజమాన్యం మొగ్గు చూపవచ్చు. 

ఇంగ్లాండ్ తో తొలి టెస్టుకు భారత జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్ టన్ సుందర్

ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్

1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్