డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9న డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ వేలం

డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9న డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ వేలం

న్యూఢిల్లీ: విమెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌) వేలం డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9న ముంబైలో జరగనుందని బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు  ఒక్కో  ఫ్రాంచైజీ శాలరీ పర్స్‌‌‌‌‌‌‌‌ను కూడా రూ. 3.5 కోట్లకు పెంచనున్నారు. టోర్నీలో పాల్గొంటున్న మొత్తం ఐదు ఫ్రాంచైజీల నుంచి 29 మందిని రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌ వద్ద అత్యధికంగా రూ. 5.95 కోట్ల మొత్తం ఉండగా 10 మందిని కొత్తగా తీసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. 

యూపీ వారియర్స్‌‌‌‌‌‌‌‌ వద్ద రూ. 4 కోట్లు, రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు వద్ద రూ. 3.35 కోట్లు ఉన్నాయి. రెండో ఎడిషన్‌‌‌‌‌‌‌‌ డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో జరగనుంది. వేదికలను అధికారికంగా ఖరారు చేయకపోయినా ముంబై, బెంగళూరులో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరిగే చాన్సెస్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి.