ధోనీ కెప్టెన్సీపై వేటును ఆపాను

ధోనీ కెప్టెన్సీపై వేటును ఆపాను

న్యూఢిల్లీ: 1983లో కపిల్ డెవిల్స్ మ్యాజిక్ చేసిన తర్వాత 28 ఏళ్లకు 2011లో మహేంద్ర సింగ్ ధోనీ ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు. ఆ ఘనత సాధించిన కొన్నాళ్లకే ధోనీని టీమ్ కెప్టెన్ గా తప్పించాలని సెలెక్టర్లు ప్రయత్నించారట. అయితే, తన అధికారాన్ని ఉపయోగించి దాన్ని అడ్డుకున్నానని అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసన్ వెల్లడించారు. ‘ధోనీని కెప్టెన్ గా తప్పించాలనే ఆలోచనే నాకు అన్యాయంగా కనిపించింది. సెలెక్టర్ల ఆలోచన ఎలా ఉన్నా నేను మాత్రం అందుకు అంగీకరించలేదు. నేను నమ్మిన దానికోసం నిలబడినందుకు ఇప్పటికీ గర్వపడుతున్నా. 2011 వరల్డ్ కప్ విజయం తర్వాత ఇండియా.. ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లింది. అక్కడ 0–4తో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్లోనూ అదే జరిగింది. ఆ రిజల్ట్స్ ను కారణంగా చూపి ధోనీని వన్డే టీమ్ కు కెప్టెన్ గా తప్పించాలని సెలెక్టర్లు చూశారు. కానీ వరల్డ్ కప్ సాధించిన వ్యక్తిని కెప్టెన్సీ నుంచి ఎలా తొలగిస్తారనేది నా ప్రశ్న. పైగా ధోనీ కాకపోతే ఎవరు అనే దానికి సెలెక్టర్ల దగ్గర కూడా బదులు
లేదు. అప్పటి బోర్డు సెక్రటరీ సంజయ్ జగ్దాలే ద్వారా నాకు సెలెక్టర్ల ఆలోచన తెలిసింది. దీంతో ప్రెసిడెంట్ గా నాకున్న అధికారాన్ని ఉపయోగించి దానిని అడ్డుకున్నా. నిజానికి ధోనీ ఓ తిరుగులేని క్రికెటరే కాదు నిజాయితీపరుడు. సెలెక్షన్ మీటింగ్స్ లో అతన్ని చాలాసార్లు చూశా. అతని విజన్, ఆలోచనలు తప్పని ఒక్కసారి కూడా ప్రూవ్ అవ్వలేదు. నా లైఫ్లో ఎంతోమంది వ్యక్తులని చూశా కానీ ధోనీ లాంటి పర్సన్ ఇంకొకరు నాకు కనిపించలేదు’ అని శ్రీని చెప్పుకొచ్చారు.

For More News..

ఫేస్ బుక్ పై పొలిటికల్ హీట్

ప్రపంచంలోనే హయ్యెస్ట్ టెంపరేచర్ రికార్డ్

చైనాకు పోటీ ఇవ్వలేకపోతున్న లోకల్‌ కంపెనీలు