బషీర్ బాగ్, వెలుగు: ఉద్యోగాల బదిలీలు, ప్రమోషన్లలో బీసీలకు దామాషా పద్ధతిలో సా మాజిక న్యాయం పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బీసీ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
జాజుల మాట్లా డుతూ.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజ ర్వేషన్లను కల్పించాలని.. క్రిమిలేయర్ను తొల గించాలని కోరారు. దీని కోసం బీసీ ఉద్యోగులం తా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కులాల, యూనియన్ల వారీగా విడిపోకుండా హక్కుల సాధన లక్ష్యంగా ఏకతాటిపైకి రావాలన్నారు. ప్రభుత్వంలోని వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులందరూ సంఘంలో చేరాలని పిలుపునిచ్చారు.