తల్లిని ముక్కలుగా నరికి చంపిన కొడుకు

తల్లిని ముక్కలుగా నరికి చంపిన కొడుకు

బ్రసెల్స్: కన్న తల్లిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడో యువకుడు.. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్​లో పెట్టి కాలువలో పడేశాడు. బెల్జియం, లీజ్ ఏరియాలోని సెరాయింగ్‌‌‌‌లో  జులై 10న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఈ మర్డర్ గురించి చెప్పాడు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి వెతికినా అక్కడ హత్య జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. మద్యం మత్తులో ఎవరో ఫేక్ కాల్ చేసుంటారని అనుకున్నారు. ఎందుకైనా మంచిదని కాలువలోనూ గాలించగా.. ఓ రిఫ్రిజిరేటర్ కనిపించింది.

దాన్ని బయటకు తీసి ఓపెన్ చేయగా అందులో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. రెండు చేతులు, రెండు కాళ్లు అందులో పెట్టి కాల్వలో పడేశాడు నిందితుడు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన పోలీసులకు అక్కడే మరో కంటెయినర్ దొరికింది. అందులో మహిళ తల, మొండెం కనిపించాయి. గోళ్లు, జ్యువెల్లరీ, టాటూల ఆధారంగా ఆమె వివరాలను గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ముందు బాధితురాలి కొడుకును అదుపులోకి తీసుకుందామని అతని కోసం వెతికారు. అప్పటికే నిందితుడు సౌత్ కొరియాకు పారిపోవాలని స్కెచ్ వేశాడు. కానీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.