పార్లమెంట్ ముందు చిన్నయ్య బాధితురాలి ఆందోళన

పార్లమెంట్ ముందు చిన్నయ్య బాధితురాలి ఆందోళన
  • ప్లకార్డు ప్రదర్శించిన బాధితురాలు
  • తనకు న్యాయం చేయాలని రిక్వెస్ట్

ఢిల్లీ: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ పార్లమెంటు ముందు ఆందోళనకు దిగారు. ‘ఏమిటి ఈ దారుణం..పార్లమెంట్ లో మణిపూర్ మహిళల పై జరిగిన దాడులు గురించి బాగానే ఫ్ల కార్డ్స్ చూపిస్తున్నారు.సొంత రాష్ట్రం తెలంగాణ లో మీ పార్లమెంట్ పరిధి లో గల ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య నా మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అంటే మీకు వినపడటం లేదా?నేను పార్లమెంట్ భవనం ముందు 2 రోజులు కూర్చుని నిరసన తెలియజేస్తూ ఉంటే మీకు కనబడడం లేదా? గత 6 నెలలుగా నేను చేస్తున్న పోరాటం మీకు తెలిసి తప్పించుకుని తిరగడం ఎంతవరకు సబబు? నాకు న్యాయం చేయండి సార్..ప్లీజ్’అంటూ ఎంపీలను వేడుకున్నారు