ఆహారశుద్ధి పరిశ్రమలతో రైతులకు మేలు : మంత్రి కేటీఆర్​

ఆహారశుద్ధి పరిశ్రమలతో రైతులకు మేలు : మంత్రి కేటీఆర్​

రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్‌ పాలసీలపై మంత్రులతో కేటీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులు, దాని వల్ల మనకు ఆహార శుద్ధి రంగంలో వస్తున్న నూతన అవకాశాల గురించి కేటీఆర్‌ వివరించారు.

రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులు, దానివల్ల ఆహారశుద్ధి రంగంలో వస్తున్న నూతన అవకాశాలపై కేటీఆర్‌ వివరించారు. జలవిప్లవం తోడ్పాటు వల్ల పాడి, మత్స్య, మాంసం, పాల ఉత్పత్తి పరిశ్రమల్లోనూ కొత్త ఒరవడులు రానున్నట్లు తెలిపారు. సీఎం చొరవతో గొర్రెలు, చేప పిల్లల పెంపకం గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలోని గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో… ఏ పంటలు పండుతున్నాయనేది పూర్తిగా మ్యాపింగ్ చేశామన్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్‌ చేసే సామర్థ్యం మనకు లేదన్న మంత్రి  కేటీఆర్ …నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయని స్పష్టం చేశారు. అందువల్ల వెంటనే ఆహారశుద్ధి రంగ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా రైతుకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆహారశుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.