మందమర్రిలో సింగరేణి స్క్రాప్ పట్టివేత

మందమర్రిలో సింగరేణి స్క్రాప్ పట్టివేత

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని విద్యానగర్​హనుమంత్​ స్ర్కాప్​ దుకాణంలో సింగరేణి సంస్థకు సంబంధించిన 2,180 కిలోల ఇసుప స్క్రాప్​ను మంగళవారం సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. సెక్యూరిటీ విభాగం ఇంటలిజెన్స్​ గార్డు కె.శ్రీనివాస్ రావు, దాసరి మల్లేశ్ ఇచ్చిన సమాచారంతో ఎస్​ అండ్ ​పీసీ జూనియర్​ ఇన్​స్పెక్టర్, ఐడీ పార్టీ సిబ్బంది దుకాణంపై రైడ్​చేశారు. 

సింగరేణి స్ర్కాప్​ను వ్యాన్​లో లోడ్ ​చేసుకొని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వ్యాన్​ను పట్టుకున్నారు. పట్టుకున్న స్ర్కాప్ ​విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని, స్క్రాప్​తో ఉన్న వ్యాన్​ను స్వాధీనం చేసుకొని డ్రైవర్​ను మందమర్రి పోలీసులకు అప్పగించామని వారు తెలిపారు.