- సర్జరీ కారణంగా గైర్హాజరు
న్యూఢిల్లీ: బెంగళూరులో సోమవారం జరగనున్న ప్రతిపక్ష పార్టీల డిన్నర్కు బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వెళ్లడం లేదు. అయితే మంగళవారం జరిగే మీటింగ్ లో మాత్రం ఆమె పాల్గొంటారు. ‘‘మమత బెనర్జీకి ఇటీవల ఎడమ మోకాలుకు చిన్న సర్జరీ జరిగింది. డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అందుకే ఆమె డిన్నర్కు వెళ్లడం లేదు. తెల్లారి జరిగే మీటింగ్కు మాత్రం హాజరవుతారు” అని టీఎంసీ వర్గాలు శనివారం పేర్కొన్నాయి.
మమత తరఫున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ ప్రతిపక్షాల డిన్నర్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపాయి. కాగా, ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో ప్రతిపక్షాల రెండో సమావేశం జరుగుతుంది. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతున్నారు.