
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది మాస్క్ ధరించడం. మాస్క్ ధరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు కూడా. లేదంటే కఠిన చర్యలతో పాటు భారీ ఫైన్ తప్పదని స్పష్టం చేశారు. మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న ప్రజలనుంచి బెంగళూరులో..గత నెలరోజుల వ్యవధిలో ఏకంగా కోటి జరిమానా వసూలు చేశారు. బెంగళూరు నగర వ్యాప్తంగా మాస్కులు లేని వారిని ట్రాఫిక్ పోలీసులు, బీబీఎంసీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూన్ నెలలో కోటి రూపాయల జరిమానా వసూలు చేసినట్టు అధికారులు ప్రకటించారు. మాస్కులు లేని వారు, భూతిక దూరం పాటించనివారు 50,706 మందిని గుర్తించి వారికి జరిమానా విధించారు .వీరి నుంచి రూ.1.91 కోట్లు వసూలు చేసింది. ఒక్కొక్కరికి రూ.200 చొప్పు న జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.