చెలరేగిన కొహ్లీ.. కోల్ కతా టార్గెట్ 206

చెలరేగిన కొహ్లీ.. కోల్ కతా టార్గెట్ 206

బెంగళూరు:  కోల్ కతా నైట్ రైడర్స్ కు 206 టార్గెట్ ను ముందుంచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చినస్వామి స్టేడియంలో జరిగిన ఈమ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు పరుగుల వరద సృష్టించింది. కెప్టెన్ వీరాట్ కొహ్లీ,ఏబీ డివిలియర్స్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి 205 స్కోర్  చేసింది బెంగళూరు. బెంగళూరు బ్యాట్స్ మెన్  పార్థివ్ పటేల్ 25 పరుగులు, విరాట్ కొహ్లీ 49 బంతుల్లో 84, డివిలియర్స్ 32 బంతుల్లో 63 పరుగులు చేశారు. మెర్కస్ స్టోనిస్ 13 బంతుల్లో 28 రన్స్ చేయగా మోయిన్ అలీ నాటౌట్ గా నిలిచారు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరేన్, కుల్దీప్ యాదవ్, నితిష్ రాణాలు తలో ఒక వికెట్ తీశారు.