భద్రాద్రిలో అన్యమత ప్రచారం

భద్రాద్రిలో అన్యమత ప్రచారం
  • శేషవస్త్రాలు విక్రయించే కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్యమత స్లోగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్న కవర్లు
  • ఈవోకు ఫిర్యాదు చేసిన భక్తులు, కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో అన్యమతానికి సంబంధించిన స్లోగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్న కవర్లు ఇస్తుండడాన్ని గుర్తించిన భక్తులు ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఆలయంలోని గాలిగోపురం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయం పక్కన స్వామి వారి శేషవస్త్రాలు విక్రయించే కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. ఆ కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేలంలో పొందిన కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భక్తులకు వస్త్రాలను విక్రయిస్తుంటారు. గుంటూరుకు చెందిన మేళ్లచెరువు జనార్దనరావు అనే వ్యక్తి సోమవారం రూ. 1100 పెట్టి ఓ పట్టు చీర కొనుగోలు చేశాడు. 

ఆ చీరను కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు ఓ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టి జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు ఇచ్చారు. ఆ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అన్యమతానికి సంబంధించిన వాక్యం ఉండడంతో గమనించిన జనార్దనరావు వెంటనే ఈవోకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఈవో రమాదేవి విచారణకు ఆదేశించారు. వస్త్రాలు అమ్మే కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేసి, కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని 
కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.