
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 50 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా మొత్తం రూ.1,97,79,049 ఆదాయం వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు.
అలాగే హుండీల్లో 65 గ్రాముల బంగారం, 1500 గ్రాముల వెండితో పాటు 1,689 యూఎస్ డాలర్లు, 580 థాయిలాండ్ భాట్స్, 50 సింగపూర్ డాలర్లు, 20 మలేషియా రింగెట్స్, 10 నేపాల్ రూపీస్, 15 ఐర్లాండ్ పౌండ్స్, 15 ఇంగ్లాండ్ పౌండ్స్, ఐదు వియత్నాం డాంగ్స్ వచ్చినట్లు ఈవో వెల్లడించారు.