
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ.కోటి నజరానా ప్రకటించింది. హైదరాబాద్ లోని ఐటీడీఏ పీవో బి.రాహుల్ను ప్రశంసిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్,స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, ట్రైబల్వెల్ఫేర్ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్శుక్రవారం సన్మానం చేశారు. గత నెల 7న రాష్ట్ర గవర్నర్జిష్ణుదేవ్వర్మ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మ్యూజియాన్ని ప్రారంభించారు.
రెండు రోజుల కింద మంత్రి సీతక్క ట్రైబల్మ్యూజియాన్ని సందర్శించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు కళ్లకు కన్పించేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. గిరిజన సంప్రదాయ దుస్తులు, వస్తువులతో టూరిస్టులు ఫొటోలు దిగడం, గిరిజన వంటకాల స్టాల్స్, అటవీ ఉత్పత్తులు, చెక్క బొమ్మలు ఇలా అన్నీ పిల్లలు, పెద్దలను ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులకు స్విమ్మింగ్ఫూల్, బాక్స్ క్రికెట్, సెల్ఫీ పాయింట్లు రాత్రి పూట అలరిస్తున్నాయి. ఈ మ్యూజియాన్ని ఇంకా డెవలప్ చేసి టూరిస్టులను ఆకర్షించేలా కేంద్రం నిధులు ఉపయోగపడనున్నాయి.