V6 News

భద్రాచలం సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి పూనెం కృష్ణ దొర విజయం

భద్రాచలం సర్పంచ్ గా  కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి  పూనెం కృష్ణ దొర విజయం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పంచాయతీ సర్పంచ్​గా పూనెం కృష్ణదొర ఎన్నికయ్యారు. బీఆర్ఎస్​అభ్యర్థి మానె రామకృష్ణపై1,684 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. స్థానిక డిగ్రీ కాలేజీలో శుక్రవారం తెల్లవారుజాము వరకు కౌంటింగ్​జరిగింది. ముందుగా పంచాయతీలోని 20 వార్డుల ఓట్లను లెక్కించారు. ఒకటో వార్డులో తీవ్ర పోటీ ఉండగా, ఓట్లను రెండు సార్లు లెక్కించగా.. చివరకు  కాంగ్రెస్​అభ్యర్థి చెంచు సుబ్బారావు మూడు ఓట్ల మెజార్టీతో గెలిచారు.

14వ వార్డులో ఇండిపెండెంట్​అభ్యర్థి ఇలమల అశోక్​కుమార్, కాంగ్రెస్​అభ్యర్థి అరికెల తిరుపతిరావుకు సమాన ఓట్లు పడ్డాయి.  దీంతో టాస్ లో​ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గాకుమారి ఒక ఓటుతో గెలిచారు.  ఆయా వార్డుల్లో చివరివరకు లెక్కింపు ఉత్కంఠగా కొనసాగింది.  

వార్డుల్లో 14 కాంగ్రెస్​, సీపీఎం 2, సీపీఐ 1, టీడీపీ1, ఇండిపెం డెంట్1, బీఆర్ఎస్1 గెలిచాయి. అనంతరం సర్పంచ్ ఓట్ల కౌంటింగ్​జరిగింది. మొత్తం19,838 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణదొరకు 8,416, బీఆర్ఎస్​అభ్యర్థి మానె రామకృష్ణకు 6,732 ఓట్లు, మహాకూటమి అభ్యర్థి హరిశ్చంద్రనాయక్​కు 2,756 ఓట్లు పడ్డాయి. చివరివరకు కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిపత్యాన్ని చూపారు.