పెండ్లికి ముస్తాబైన భద్రాద్రి రామయ్య

పెండ్లికి ముస్తాబైన భద్రాద్రి రామయ్య
  • భద్రాద్రిలో పెళ్లి పనులకు శ్రీకారం

భద్రాద్రి రామయ్య పెండ్లి పనులకు శ్రీకారం చుట్టారు. డోలా పౌర్ణమి సందర్భంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని  శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డోలోత్సవం, వసంతోత్సవం, తలంబ్రాలు కలిపే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మణుగూరు మన్యం నుంచి గోటితో ఒలిచిన తలంబ్రాలను తీసుకొచ్చారు. భద్రాద్రి రామయ్యను పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. సాయంత్రం స్వామి వారికి తిరువీధి సేవను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఈవో గదరాజు నర్సింహులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏప్రిల్ 2న శ్రీరామ నవమి నాడు సీతారాముల కల్యాణం జరిపించనున్నారు.